కొత్త జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో  బీజేపి నుండి భారాస పార్టీలోకి చేరికలు

కొత్త జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో  బీజేపి నుండి భారాస పార్టీలోకి చేరికలు

ముద్ర, బోయినిపల్లి;రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బీజేపి పార్టీ యువ నాయకుడు వేసిరెడ్డి రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో 25 మంది యువకులు బిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు కొత్త జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఅర్ఎస్ పార్టీలో చేరారు.సందర్భంగా రాష్ట్ర నాయకులు కొత్త జైపాల్ రెడ్డి మాట్లాడుతూ: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేకపోవడం అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళ నాయకుల గొడవలతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం లేదని, రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని తెలిపారు. బీజేపీ నుండి చేరిన యువకులు మన  సీఎం కేసిఆర్ చేసిన అభివృద్ధి పనులు, చేపట్టిన పథకాలు రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల ప్రభుత్వ పథకాలు బాగున్నాయని మరొక్కసారి బిఅర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవి శంకర్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బోయినిపల్లి మండల యూత్ అధ్యక్షులు కట్ట గోవర్థన్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రామిడి రాజు తదతరులు పాల్గొన్నారు.