రక్తదాత...ప్రాణదాత... పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం - ఎస్పీ అఖిల్ మహాజన్

రక్తదాత...ప్రాణదాత... పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం - ఎస్పీ అఖిల్ మహాజన్

ముద్ర ప్రతినిధి,  రాజన్న సిరిసిల్ల: విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా( ఫ్లాగ్ డే) గురువారం సిరిసిల్ల పట్టణంలోని  పద్మనాయక ఫంక్షన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటి వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై,మాట్లాడుతూ 
 ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో బలైన అమర పోలీసులు వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.సమాజ రక్షణ వీరులు నిరంతర ధీరులు ప్రాణాలను కూడా లెక్కచేయని విధి నిర్వహణ రక్షకులు, ప్రకృతి విలయతాండవం చేస్తే అభయమిచ్చి కాపాడే ఆప్తులు నిద్రించే సమాజానికి నిద్రపోని కాపలాగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.
రెగ్యులర్ పోలీసింగ్ తో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది  తలసేమియా, సికిల్ సెల్ అనీమియా    మరియు డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరం వారికి సహాయం కోసం అమరవిరుల స్మరకర్ధం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 600 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది,జిల్లాలోని యువకులు, బిఎస్ఎఫ్ సిబ్బంది  పాల్గొని విజయవంతం చేయడం జరిగిందనీఅన్నారు.సిరిసిల్ల,కరీంనగర్,మంచిర్యాల జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి  సహకరించారు అని అన్నారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు ముందుకు వచ్చి త్సాహంగా పాల్గొనడం అభినందించ దగ్గ విషయం  అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, రవికుమార్, సిఐ లు ఉపేందర్, సధన్ కుమార్, శశిధర్ రెడ్డి, కరుణాకర్, కృష్ణకుమార్,కిరణ్ కుమార్, అనిల్ కుమార్,సిరిసిల్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అద్యక్షుడు గుడ్ల రవి ,వరంగల్ అధ్యక్షుడు శ్రీనివాస్ ,కరీంనగర్ అధ్యక్షుడు కేశవరెడ్డి ,మంచిర్యాల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి  ఎస్ఐ లు పోలీస్ సిబ్బంది బిఎస్ఎఫ్  సిబ్బంది,యువకులు  పాల్గొన్నారు.