ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి - చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి -  చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలని చౌటుప్పల్ ఏసీపి మధుసూదన్ రెడ్డి అన్నారు .మంగళవారం భూదాన్ పోచంపల్లిలోని  పోలీస్ స్టేషన్ నుండి నేతాజీ చౌరస్తా వరకు స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక దళాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు .ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కవాతు నిర్వహించమన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నచ్చిన వ్యక్తికి ఓటు వేసెలా ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామన్నారు .ఎన్నికల నిబంధనలపై ఫిర్యాదు చేసేందుకు ఓటర్లు సివిజిల్ యాప్ ,టోల్ ఫ్రీ నెంబర్ 1950ను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సిఐ రాములు, స్థానిక ఎస్సై భాస్కర్ రెడ్డి, ఏఎస్ఐ లు శంకర్ నాయక్ ,సైదిరెడ్డి, పోలీసు సిబ్బంది మహమ్మద్, ముత్తయ్య గౌడ్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.