ధర్నాను విజయవంతం చేయాలి

ధర్నాను విజయవంతం చేయాలి

రామకృష్ణాపూర్,ముద్ర :  సెప్టెంబర్ 1న జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు తలపెట్టే మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆర్కేపి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అవరణలో కార్మికులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హాజరై అక్బర్ అలీ మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం 11 వ వేజ్ బోర్డు 23 నెలల ఎరియర్స్ చెల్లింపుపై  లాభాల వాటా ఇప్పటివరకు ప్రకటించక పోవడంతో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనీ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఆంజనేయులు,ఉపాధ్యక్షుడు లింగయ్య,ఫిట్ కార్యదర్శి సంపత్ కుమార్,ఫిట్ ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి,సహాయ కార్యదర్శి రామకృష్ణ,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.