రైతులను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి

రైతులను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
  • కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి

ముద్ర.వీపనగండ్ల:-రైతులను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి అన్నారు.నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వీపనగండ్ల మండలం సంపట్రావు పల్లి , వల్లభాపురం తండా , వల్లభాపురం గ్రామాలలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ వచ్చాక బోర్లలో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు, తాగడానికి నీళ్లులేవని,పంటలు ఎండిపోతున్నాయని కరెంటు ఉండడం లేదని,వద్దురో కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్నారని విమర్శించారు.కేసీఆర్ హయాంలో వడ్లను గిట్టుబాటు ధరకు కొన్నాం. 500 బోనస్‌తో 2500కు కొంటామన్న రేవంత్... ఇప్పుడు రైతులు 1800లకే అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నడని అన్నారు.

కేసీఆర్ కరోనా సమయంలో సైతం రైతుబంధు ఆపలేదని,రేవంత్ రైతులకిచ్చిన రైతుబంధు 15వేలు, కౌలురైతులకు 15వేలు, వ్యవసాయ కూలీలకు 12వేలు ఇస్తామని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని,పైగా 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిండని,అవ్వాతాతలకు 4 వేల పింఛన్ ఇస్తామని వాళ్లనూ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.ఓట్ల కోసం కాంగ్రెస్ లీడర్లు వస్తే బుద్ధి చెప్పడానికి మహిళలు, చీపుర్లు, చాటలతో రెడీగా ఉన్నారని,ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నాడు. రెండు నెలల్లో లక్ష లగ్గాలు జరిగాయి. రేవంత్ లక్ష తులాల బంగారం బాకీ పడ్డడని అన్నారు.మన గుండెలమీద తన్నిన రేవంత్ రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో గడ్డపారలై పోటుపొడవాలని,నాలుగు నెలలైనా హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేసి మోసపోదామాని ప్రశ్నించారు.

బీజేపీ పదేళ్ల పాలన ప్రజలకు ఒక్క మేలైనా చేసిందా?చెప్పుకోడానికి ఏమీ లేదు కనుక కేలండర్లు, అక్షింతలు పంచుతున్నారు._ధరలు పెంచి గరీబోళ్ల నడ్డి విరిచింది మోదీ ప్రభుత్వం._ప్రశ్నించే గొంతులను గెలిపివ్వండి.. కాంగ్రెస్ మెడలు వంచి హమీలను అమలు చేస్తాం అని,పబ్లిసిటీ చేసేవాళ్లు కావాలా, పనిచేసేవాళ్లు కావాలా అన్నారు.అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేతలు నేలకు దిగిరావాలంటే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను పార్లమెంటుకు పంపాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వర్ రావు, మాజీ స్పోర్ట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్,మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడు,ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి,మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు ముంత మల్లయ్య,మాజీ సర్పంచ్ లు రామేశ్వర్ రావు,అంజయ్య,నాయకులు తేజ రెడ్డి, సాయిరాం,కురుమయ్య తదితరులు ఉన్నారు.