నిర్మల్ చరిత్ర రచయిత అంకం రాములు మృతి

నిర్మల్ చరిత్ర రచయిత అంకం రాములు మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ చరిత్ర పుస్తక రచయిత, రిటైర్డ్ ఉపాధ్యాయుడు అంకం రాములు శుక్రవారం తెల్లవారు జామున మరణించారు. ఆయన రచించిన నిర్మల్ చరిత్ర బహుళ ప్రాచుర్యం పొందింది. ఆయన మృతిపట్ల తెలంగాణా రచయితల వేదిక సంతాపం ప్రకటించింది. ఆయనకు నివాళులు అర్పించారు.