ఊపందుకున్న బిజెపి ప్రచారం

ఊపందుకున్న బిజెపి ప్రచారం
  • ప్రతి వర్గాన్ని కలుస్తున్న నేతలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: లోక్ సభ ఎన్నికలలో భాగంగా వివిధ పార్టీల నేతలు చేస్తున్న ప్రచారం ఊపందుకుంది కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో సభలు, సమావేశాల బదులు ప్రజలు ఎక్కడ గుమి గూడే అవకాశం ఉంటే అక్కడికి  వెళ్లి నేతలు కలుస్తున్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో కొనుగోలుదారులు అమ్మకండరులను కలిసి  ప్రచారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో  బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గొడం నగేష్, జిల్లా మండల బీజేపీ నాయకులు పాల్గొని బీజేపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. బిజెపి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే లక్ష్మణ చాందా మండలం వడ్యాల్ లో ఉపాధి హామీ కూలీ లను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు.