కేసీఆర్ ప్రచార నిషేధం , ఓటుకి నోటు కేసు పై  మీడియా తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

కేసీఆర్ ప్రచార నిషేధం , ఓటుకి నోటు కేసు పై  మీడియా తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
  • కేసీఆర్ ప్రచార నిషేధం మోడీ , రేవంత్ కుట్రలో భాగమే 
  • మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా
  • నేత కార్మికులని అవమానకరంగా మాట్లాడిన సందర్భంలోని మాటలు వక్రీకరించారు
  • కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్, మోడీకి వణుకుడు మొదలైంది
  • ఆరు యాత్రలతోనే ఇద్దరి కాళ్ళ కింద భూమి కంపిస్తుంది
  • ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారు
  • కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నం
  • కేసీఆర్ ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రేట్టింపు ప్రజా మద్దతు వస్తుంది
  • మోడీ విద్వేషాలు ప్రచారం ఈసీకి కనిపించడంలేదా
  • ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే రేవంత్ కి నోటీసులు కేసీఆర్ కి మాత్రం ప్రచార నిషేధమా
  • కేసీఆర్ ని అడ్డుకోకపోతే నష్టం జరుగుతుందనే కుట్ర
  • వీధి రౌడిగా మాట్లాడిన రేవంత్ స్వేచ్ఛగా తిరిగితుంటే కేసీఆర్ ని మాత్రం ఇంట్లో పరిమితం చేస్తున్నారు
  • రేవంత్ ఢిల్లీ మూటల పై సమాచారం ఉంటే మోడీ ఎందుకు కేసులు పెట్టడంలేదు
  • రేవంత్ అవినీతి తెలిసినా మోడీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయి
  • కేసీఆర్ లెవనెత్తుతున్న ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా పక్కదారిపట్టించడం కోసమే డ్రామాలు
  • నిషేధాలు ఏవీ కేసీఆర్ ని ఆపలేవు
  • కేసీఆర్ ప్రచారంలో ఎందుకు కనిపించడంలేదని ప్రజల్లో చర్చ మొదలైంది
  • ఎన్ని నిషేధాలు పెట్టినా 16 సీట్లు మావే
  • కేసీఆర్ ని ప్రచారం చేయకుండా ఆపడం మా ఓట్ల శాతాన్ని పెంచుతుంది
  • ఓటుకి నోటు కేసు ఇక్కడ ఉంటే ప్రభావితం చేస్తారని అనుమానం ఉంది
  • అందుకే ఇతర రాష్ట్రంలోకి మార్చాలని కోరాం
  • కోర్టు నుండి సరైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం

సూర్యాపేట ముద్ర ప్రతినిధి:-బారాసా అధ్యక్షులు కేసీఆర్ పై ప్రచార నిషేధం మోడీ , రేవంత్ కుట్రలో భాగమే అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట లో మీడియా మాట్లాడిన జగదీష్ రెడ్డి,మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు నేత కార్మికులని అవమానకరంగా మాట్లాడిన సందర్భంలో స్పందించిన కేసీఆర్ మాటలను వక్రీకరించారని అన్నారు. 

కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్ మోడీకి వణుకుడు మొదలైంది అన్నారు.ఆరు యాత్రలతోనే ఇద్దరి కాళ్ళ కింద భూమి కంపిస్తుందని పేర్కొన్నారు. చోటే బాయ్..బడే భాయ్ ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారని మండి పడ్డారు.కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రేట్టింపు ప్రజా మద్దతు వస్తుంది అన్నారు.మోడీ విద్వేషాలు ప్రచారం ఈసీకి కనిపించడంలేదా అంటూ ఫైర్ అయ్యారు.ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే రేవంత్ కి నోటీసులు, మా  సోషల్ మీడియా ఇంఛార్జి క్రిషాంక్ అరెస్టు, మా అధినేత కేసీఆర్ కి మాత్రం ప్రచార నిషేధమా అంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ ని అడ్డుకోకపోతే నష్టం జరుగుతుందనే కుట్ర కు తెర లేపారని అన్నారు.వీధి రౌడిగా మాట్లాడిన రేవంత్ స్వేచ్ఛగా తిరిగితుంటే కేసీఆర్ ని మాత్రం ఇంట్లో పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ ఢిల్లీ మూటల పై సమాచారం ఉంటే మోడీ ఎందుకు కేసులు పెట్టడంలేదనీ ప్రశ్నించారు.రేవంత్ అవినీతి తెలిసినా మోడీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని అన్నారు.కేసీఆర్ లెవనెత్తుతున్న ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా పక్కదారిపట్టించడం కోసమే డ్రామాలు ఆడుతున్నారని,నిషేధాలు ఏవీ కేసీఆర్ ని ఆపలేవు అన్నారు.కేసీఆర్ ప్రచారంలో ఎందుకు కనిపించడంలేదని ప్రజల్లో చర్చ మొదలైంది అన్నారు.ఎన్ని నిషేధాలు పెట్టినా 16 సీట్లు మావే అన్నారు. కేసీఆర్ కు మద్దతుగ నేతన్నలు కదిలివస్తున్నారని అన్నారు.కేసీఆర్ ని ప్రచారం చేయకుండా ఆపడం మా ఓట్ల శాతాన్ని పెంచుతుంది అన్నారు.  రేపు వివరణ  కు  రానున్న ఓటు కు నోటు కేసుపై మాట్లాడిన జగదీష్ రెడ్డి ,ఓటుకి నోటు కేసు ఇక్కడ ఉంటే ప్రభావితం చేస్తారని అనుమానం ఉందన్నారు.అందుకే ఇతర రాష్ట్రంలోకి మార్చాలని కోరాం అన్నారు.కోర్టు నుండి సరైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.