మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఢిల్లీ హైకోర్టు పిటిషన్ను తిరస్కరించింది. మార్చి 31న బెయిల్ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టులో మనీష్ సిసోడియా సవాల్ చేశారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురు కావడంతో బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.