పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎంపీల ఆందోళన.
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్. ఎంపీల నినాదాలతో దద్దరిల్లుతున్న పార్లమెంట్ ఆవరణ. మోదీ-అదానీ పేర్లను కలిపి మోదానీ అంటూ ప్లకార్డుల ప్రదర్శన. బీఆర్ఎస్ ఎంపిల ధర్నాకు మద్దతు తెలుపుతూ ఆందోళనలో పాల్గొన్న విపక్ష పార్టీల ఎంపీలు.