జిల్లాలు రద్దుచేస్తే ప్రజల చేతిలో బస్మీపట్టలం అవుతారు – మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

జిల్లాలు రద్దుచేస్తే ప్రజల చేతిలో బస్మీపట్టలం అవుతారు  – మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ముద్ర.వనపర్తి:- జిల్లాలు రద్దుచేస్తే ప్రజల చేతిలో బస్మీపట్టలం అవుతారని,జిల్లాల రద్దుపై మంత్రి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి స్పందించారా అని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.శుక్రవారం వనపర్తి లోని తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అమలుకు,ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని చిత్తశుద్ధి ఉంటే హామీలు అమలు చేసి ఓటు అడగాలని డిమాండ్ చేశారు.జిల్లాల ఏర్పాటు పరిపాలన సౌలభ్యం కోసం ప్రాంత అభివృద్ధి కోసం పునర్విభజన అధ్యయనం చేసి ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ప్రక్రియ వల్ల ప్రజల జీవన ప్రమాణాలు,ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు.

జిల్లాల రద్దుపై ముఖ్యమంత్రి స్పందించాలని లేకుంటే ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మాట తప్పిన కాంగ్రెస్ పార్టీని ఆమోదించినట్లేనని,పోడు,కౌలు రైతుల రైతు బంధు ఏమైందిని,పోడు,కౌలు రైతులకు కె.సి.ఆర్ 4లక్షల 50వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చి హక్కులు కలిపించిందని వారికి రైతు బంధు ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.కాబట్టి ప్రజలు మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలను నట్టేట ముంచుతారన్నారు.ఈ ఎన్నికలలో ఆలోచించి కె.సి.ఆర్ ఆశీర్వదించిన టబిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,జడ్పీటీసీ రఘుపతిరెడ్డి, లక్షమరెడ్డి,మన్నేపు రెడ్డి, నందిమల్ల.అశోక్ పాల్గొన్నారు.