రాహుల్ గాంధీ సభకు భారీగా ఏర్పాట్లు

రాహుల్ గాంధీ సభకు భారీగా ఏర్పాట్లు
  • పర్యవేక్షణలో మంత్రి సీతక్క, డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ లో రాహుల్ గాంధీ ఈ నెల 5 న  పాల్గొననున్న సభా స్థలిని ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి సీతక్క,డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు,ఎంపీ అభ్యర్థి శ్రీమతి ఆత్రం సుగుణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొననున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం  కలెక్టరేట్ రోడ్ ప్రాంతంలో ఈ నెల 5వ తేదీన కాంగ్రెస్ నిర్వహించబోయే ఈ సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు.

ప్రధానంగా సభ కు హాజరయ్యే వారికోసం ట్రాఫిక్ ఏర్పాట్లు, మంచి నీరు, భారీ టెంట్స్ వంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీహరి రావు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేష్, ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాందేడపు చిన్ను, పూదరి అరవింద్, కొంతం  గణేష్ తదితరులు ఉన్నారు.