కర్నాటకలో రేపే పోలింగ్.... వీడని బజరంగ్బళీ ఫీవర్
కర్నాటకలో రేపే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఉత్కంఠ రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు. బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేశాయి. 224 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. మ్యాజిక్ మార్క్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటున్న బీజేపీ. అధికారంలోకి వస్తామనే ఆశల్లో కాంగ్రెస్ ఉంది. కర్నాటక ఎన్నికలను వీడని బజరంగ్బళీ ఫీవర్. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆలయాల్లో బీజేపీ నాయకులు హనుమాన్ చాలీసా పఠనం చేస్తున్నారు. ఈ రోజు మంగళవారం కావడంతో బీజేపీ నేతలు హనుమాన్ ఆలయాలకు వెళుతున్నారు. కార్యకర్తలతో కలిసి హనుమాన్ చాలీసా చదివిన సీఎం. బెంగలూరులోని హనుమాన్ ఆలయానికి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వెళ్ళారు. ఆంజనేయ స్వామి గుడికి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వెళ్లారు.