బ్రేకింగ్ న్యూస్ - కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై కేసు నమోదు

బ్రేకింగ్ న్యూస్ -  కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై కేసు నమోదు

ముద్ర,తెలంగాణ:- కరీంనగర్‌ కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన సొంత సోషల్ మీడియా ఖాతాలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అనని మాటలను అన్నట్లుగా డీప్ ఫేక్ వీడియోలు, కాల్ రికార్డింగ్ సృష్టించి దుష్ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెలిచాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, పోలీసులకు బీజేపీ నేత కొట్టె మురళీ క్రిష్ణ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొట్టె మురళీ క్రిష్ణ ఫిర్యాదుపై కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.