శ్రీ స్వామివారిని దర్శించుకున్న  నేవి అధికారులు 

శ్రీ స్వామివారిని దర్శించుకున్న  నేవి అధికారులు 

ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని బుధవారం నేవి అధికారులు వైస్ అడ్మిరల్ రాజేష్ పెండర్కర్, రేర్ అడ్మిరల్ రవ్ నిష్ సేత్ లు దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వార్థం పలికారు. ఆలయంలో వారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  దర్శనానంతరం ఆశీర్వచన మండపం వద్ద వేదపండితులు వేదాశీర్వచనం గావించారు. దేవస్థాన కార్య నిర్వహణాధికారి  ఎ.భాస్కర్ రావు శ్రీ స్వామివారి ప్రసాదం, ఫోటొ అందజేశారు.

ఈ సందర్బంగా వైస్ అడ్మిరల్ రాజేష్ పెండర్కర్ మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రమును దర్శించి శ్రీ స్వామి వారి ఆశీస్సులు పొందడము పూర్వజన్మ సుకృతముగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మాడవీధులు ఆలయ పరిసర ప్రాంతములు తిరిగి పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆలయ విశిష్టతను, పునర్నిర్మాణ వివరాలు ఈఓ భాస్కర్ రావు నేవి అధికారులకు వివరించారు. నేవి అధికారులు ఆలయ నిర్వహణ తీరు పట్ల భాస్కర్ రావు, ఆలయ అధికారులను అభినందించారు .