వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ.. అంబులెన్సులో ఆసుపత్రికి తరలింపు..!

వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ..  అంబులెన్సులో ఆసుపత్రికి తరలింపు..!

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురైయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్ లో తరలించినట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఎండలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అస్వస్థకు గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, ప్రస్తుతం దూలం నాగేశ్వరావు ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు.