Terrorist Attack - ఎయిర్ ఫోర్స్ వాహనాలపై ఉగ్రవాదుల దాడి...

Terrorist Attack - ఎయిర్ ఫోర్స్ వాహనాలపై ఉగ్రవాదుల దాడి...

ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనాలపై ఉగ్రమూక కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు వాహనాలపై ఉగ్రమూక కాల్పులు జరిపింది. అదనపు బలగాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడి ఘటనలో మొత్తం నలుగురు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వాహనాల్లో ఒక దానిపై విండ్ షీల్డ్ మీదే 12 బుల్లెట్ల హోల్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ దాడి ఘటనలో అంతా గాయాలతో బయటపడ్డారు.

పూంచ్ జిల్లాలో ఇలా దాడి జరిగిందని సమాచారం అందడంతోనే రీఎన్ ఫోర్స్ మెంట్ ఘటనాస్థలానికి పరుగులు తీసింది. ఉగ్రమూకను ఏరేసేందుకు గాలింపు చర్యలు జరుగుతున్నాయి.పక్కా పథకం ప్రకారమే కాపుకాసి దాడి చేసినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. దాడిగి గురైన వాహనాలను దగ్గర్లోని ఎయిర్ బేస్ ప్రాంతంలో భద్ర పరిచారు. ఈ దాడిలో గాయపడిన హెలికాప్టర్లో ఉద్దమ్ పూర్ లోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ దాడితో స్థానికులు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.