రైతన్నలు దొంగలతో జర భద్రం....ఎస్సై లక్ష్మి నర్సయ్య..

రైతన్నలు దొంగలతో జర భద్రం....ఎస్సై లక్ష్మి నర్సయ్య..

పాలకీడు,ముద్ర:- రైతులు తమ పంట పొలాల వద్ద వున్న  విద్యుత్ మోటార్లను అప్రమత్తంగా ఉంచుకోవాలని స్థానిక ఎస్సై లక్ష్మి నర్సయ్య ఓ ప్రకటనలో తెలిపారు. వేసవి కాలంలో  దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాన్నారు.  రైతులు ముందస్తుగానే ఆ మోటార్లను , సంబంధించిన సామాగ్రితో పాటు పంట పొలాల్లో వద్ద గల విలువైన వస్తువులను భద్రపరుచుకోవాలను సూచించారు.  అలాగే రైతులు తమ పంట పొలాల్లో ఉన్న విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ నుండి విద్యుత్ సరఫరా కాకుండా నిలిపివేయలని పేర్కొన్నారు.   రైతులు తమ పంట పొలాల  కోయ్య కాళ్లకు నిప్పు పెడుతున్నారని దానివల్ల మంటలువ్యాపించి చుట్టుపక్కల ఉన్న గడ్డివాములక తగలబడుతున్నందున అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలను సూచించారు.